‘అఖండ’కి 50 రెట్లు ఉంటుంది.. ‘అఖండ 2’ రిలీజ్ ఎప్పుడో ప్రకటించిన బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘అఖండ 2: తాండవం’. ఇది బ్లాక్ బస్టర్ ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్. ఇప్పటికే రిలీజైన అఘోరా ఫస్ట్ లుక్, టీజర్ వారిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. బాలయ్య తాండవాన్ని ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ పై చూద్దామా అని ఆతృతగా వేచి చూస్తున్నారు. అయితే ఈ సినిమా తొలుత దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ చివరకు వాయిదా వేశారు. పఅవణ కళ్యాణ్ ‘ఓజీ’కి భయపడే వెనక్కి తగ్గారనే కామెంట్స్ వినిపించాయి. ‘అఖండ 2’ లేట్ అవ్వడానికి రీజన్ ఏంటో చెప్పిన బాలయ్య.. కొత్త విడుదల తేదీ ప్రకటించారు.

OG పోటీకి భయపడే పోస్ట్

‘అఖండ 2’ సినిమాని సెప్టెంబర్ 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ అప్పుడెప్పుడో ప్రకటించారు. దసరా స్లాట్ ని బుక్ చేసుకున్న ఫస్ట్ మూవీ ఇదే. కానీ అదే తేదీకి పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమాని షెడ్యూల్ చేయడంతో అఖండ సీక్వెల్ వెనక్కి తగ్గే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పిన సమయానికే వస్తుందని టీమ్ చెప్పుకుంటూ వచ్చింది. అయితే చివరకు విడుదల వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. OG పోటీకి భయపడే పోస్ట్ పోన్ చేసుకున్నారని పవర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అయితే బాలయ్య మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కారణంగానే సినిమా వాయిదా పడినట్లు చెబుతున్నారు.

సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలకృష్ణ.. ఇటీవల నిమ్మకూరుకు వెళ్లి తన తల్లిదండ్రులు ఎన్టీఆర్ – బసవతారకం విగ్రహాలకు నివాళులర్పించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన సినిమాల గురించి బాలయ్య మాట్లాడుతూ.. ”అఖండ-2 రాబోతోంది. సెప్టెంబర్ 25న రావడం లేదు. డేట్ త్వరలోనే చెప్తాం. డిసెంబర్ మొదటి వారంలో వస్తుంది. ఈ సినిమా కోసం తనకిచ్చిన టైమ్ సరిపోదన్నాడు థమన్. మొదటి భాగానికే సబ్ వూఫర్స్ పేలిపోయాయి. ఇక ఈ సినిమా ఎలా ఉంటుందో ఆలోచించండి. అఖండకు రెట్టింపు కాదు, దానికి 50 ఇంతలు ఉంటుంది. మంచి ఉద్దేశ్యంతో సినిమా తీశాం” అని అన్నారు.

‘అఖండ 2’ సినిమా థమన్ వల్లనే వాయిదా

ఇలా ‘అఖండ 2’ సినిమా థమన్ వల్లనే వాయిదా పడిందని చెప్పిన బాలయ్య.. పనిలోపనిగా డిసెంబర్ ఫస్ట్ వీక్ లో థియేటర్లలోకి వస్తుందని వెల్లడించారు. ఇటీవల బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఈవెంట్ లో నారా బ్రాహ్మణి సైతం థమన్ కారణంగానే సినిమా లేట్ అవుతుందనే విధంగా మాట్లాడారు. ఇప్పుడు బాలకృష్ణ కూడా అదే చెప్పారు. ఎలాగూ డిసెంబర్ 5న రావాల్సిన ‘ది రాజాసాబ్’ సినిమా సంక్రాంతికి షిఫ్ట్ అయింది కాబట్టి, ఆ డేట్ కి బాలకృష్ణ సినిమా వస్తుందని అభిమానులు భావిస్తున్నారు. గతంలో అదే తేదీకి వచ్చిన ‘పుష్ప 2’ మాదిరిగానే సంచలన విజయం సాధింస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *